అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి నేటికి 19వ రోజు. సోమ వెంకటేశ్వర్లు - ప్రభావతిల సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోఅధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, ఫౌండర్ శ్రీ పోకల చందర్ , మరియు అలుగూరు శివకుమార్, గుండా భాస్కర్, యాంసాని నర్సింహమూర్తి, దేవా అరవింద్, గౌరిశెట్టి ఉపేంద్రం, దేవా మధుబాబు, కొండూరు పశుపతీశ్వర్ నాథ్, వాసవీ క్లబ్ - రుద్రాక్ష, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 200 మందికిపైగా ఆహారం అందించడం జరిగింది.ఈ కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు ఆ " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా, హన్మకొండ అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ కోరుకుంటున్నాడు.
ఇదే రోజున వాసవి క్లబ్ రుద్రాక్ష, హన్మకొండ వారి ఆర్థిక సౌజన్యంతో అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో సుబేదారిలో మున్సిపల్ కార్మికులకు ,పేదవారికి దాదాపు 250 మందికి ఉదయం అల్పాహారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ అవోపా సహ వవ్యవస్థాపకులు,తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు లు మాన్యులు శ్రీ పోకల చందర్ గారు ముఖ్య అతిధి గా వచ్చారు. ఇంకా అవోపా హన్మకొండ అధ్యక్షులు శ్రీ ఎల్లంకి రవీందర్, దాతలు క్లబ్ అధ్యక్షులు డా.ఏ.నాగేశ్వరరావు, కార్యదర్శి గుండా వాసుదేవ్, ఉపాధ్యక్షులు పల్లెర్ల ప్రభాకరం, నూకా యాదగిరి, నూకా మధుసూదన్, పిఆర్వో గంపా రఘుపతి,సభ్యులు చకిలం రాజవీరు మరియు ట్రెజరర్ పబ్బా రవి చందర్,ఆర్సీ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు ఆ " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా, హన్మకొండ అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ కోరుకుంటున్నాడు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి