అంతర్జాతీయ వికలాంగుల దినాన్ని పురస్కరించుకుని తేదీ 01.12.2019 రోజున మంచిర్యాల జిల్లా మరియు పట్టణ ఆవోపా వారు లక్సట్టిపేట్ వికలాంగుల వికాస కేంద్రం లో దివ్యంగా విద్యార్ధినీ విద్యార్థులకు బ్రేడ్స్, ఫ్రూట్స్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమములో ఆవోపా జిల్లా అధ్యక్షులు గుండ సత్యనారాయణ పట్టణ ఆవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్ ఆవోపా రాష్ట్ర కార్యదర్శి వొజ్జెల రాజమౌళి ఆవోపా జిల్లా పట్టణ ఆవోపా నాయకులు కటుకూరి కిషన్ రాచర్ల సత్యనారాయణ అక్కన పెల్లి రవీందర్ బొదుకూరి సత్తయ్య కొంజర్ల శ్రీనివాస్ అక్కనపెల్లి కోటయ్య వికలాంగుల వికాస కేంద్ర అధికారి లక్ష్మి మేడం, వెంకటేష్, దివ్యాన్గ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ ప్రసంగిస్తూ ప్రభుత్వము మానసిక విద్యార్ధినీ విద్యార్థులకు అన్ని రకముల సహాయ సహకారాలు అందిస్తున్న నందులకు ధన్యవాదాలు తెలుపుతూ వీరికి ప్రతి రోజు మంచి ఫుడ్ కూడా అందించాలని కొరారు. ఇలాంటి మంచి కార్యక్రమము చేసిన జిల్లా మంచిర్యాల పి.ఎస్.టి లను తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకులు నూకా యాదగిరి మరియు సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.
వికలాంగ విద్యార్థులకు బ్రెడ్స్ ఫ్రూట్స్ పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి